మునుపటి నా మాట
సూర్యవంశమునందున శ్రీ రామచంద్రుడు శ్రీరస్తు! శుభమస్తు! శ్రీ రామ జననం చైత్ర శుద్ధ నవమి తిథిని ఇరవై ఏడు నక్షత్రాలల్లోని ఏడవ నక్షత్రమైన పునర్వసు లో జరిగింది. ఆ తొమ్మిది (తిథి), ఈ ఏడు (నక్షత్రం) వెరసి పదహారు కళల చంద్రుడు శ్రీరామ చంద్రుడు సూర్యవంశాన ఉద్భవించాడు. దేవతామూర్తుల వివాహం వారివారి పుట్టిన తిథి,నక్షత్రాల్లోనే జరపడం మానవులమైన మనం తరతరాలుగా ఆచరిస్తున్న ఒక నియమం. అలా – ఇదే నవమి నాడు ‘సీతారామ కళ్యాణం’ జరుపుకునీ అవతారమూర్తి రామయ్యను , సహనశీలి సీతమ్మను పదేపదే తలుచుకుంటూ వడపప్పు, పానకం (పాలూ తేనె కలసినట్లుగా ఆలూ మగలు ఉండాలి – అని కవిగారిలా అనుకోవడం అతిశయమే. వడపప్పు, పానకం వేరు వేరుగా ఉన్నా ఒకరికోసం ఒకరం అన్నట్టుగా ఉంటాయి) మిశ్రమ సేవనంతో తరిస్తాం. అయోధ్య నుంచి అడవికి , అడవి నుంచి అయోధ్యకి ‘ధర్మ రక్షకుడు’ శ్రీరాముడు పయనిస్తూ చవి చూసిన ఎనభై నాలుగు ఋతువుల కాల చక్రం అనుభవాన్ని మహర్షి వాల్మీకి రామాయణ కావ్యంగా అందించాడు. రామాయణ ప్రారంభంలోనే ఒక ప్రత్యేకత ఉంది. అదే- రామ, భరత, లక్ష్మణ , శత్రుఘ్నల జననం- తల్లుల పాయస సేవనం ద్వారా వారి జననం సాధ్య పడడం. అలాగే సీతాదేవి భూమి పొరలనుంచి రాజర్షి జనకునికి లభించడం. ఆధునిక విజ్ఞానం ఎదుట నిలుస్తున్న సంతాన వైఫల్య సమస్యల పరిష్కారాన్ని ఆదికవి కావ్యం ఆనాడే చూచాయగా సూచించింది. ఆ రహస్య మంత్రం లుప్తమై మన పరిశోధనలకి కొత్త ఆశ మాత్రమే ప్రాప్తమైంది. డబ్భైల కాలంలో ఇదంతా ‘ట్రాష్’ అని కొట్టి పారేశేవారు. ఇప్పుడు కాస్త నయం. కాసేపు ఆలోచిస్తున్నారు. శ్రీరామ నామాలు , సపరివార నామాలు దశరథ మహారాజు పెద్ద కుమారుడు రాముడు కాబట్టి రాముణ్ణి ‘దాశరథి’ అనాలి. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు- అనే వరస ఒకనాటి పాట ద్వారా మన చెవిని పడీ పడీ స్థిరపడిపోయింది కాని నిజానికి రాముడు (కౌసల్య పుత్రుడు), భరతుడు (కైక పుత్రుడు), లక్ష్మణశత్రుఘ్నులు (సుమిత్ర కవలలు) అన్నదే వరస. రాముడికి అందరూ తమ్ములే అయినా తమ్ముడు (అనుజుడు) లక్ష్మణుడినే ‘రామానుజుడు’ అంటారు. అతను సుమిత్ర పుత్రుడు కనుక ‘సౌమిత్రి’ అయ్యాడు. తమ్ములందరిలో ప్రతి ఒక్కరిని ‘దాశరథి’ అని అనకూడదు. ఆ పేరు శ్రీరాముడికే పరిమితం. క్షత్రియ ధర్మం ప్రకారం రాజు తరువాత అతని జ్యేష్ట పుత్రుడే పరిపాలకుడు. అయోధ్య పుర వాసులు రాముణ్ణి ‘అయోధ్య రామా’ అని పిలవగలరు. సూర్య వంశీయుడు కనుక రాముడిని ‘రఘు వంశ తిలకా’, ‘రఘురామా’ , ‘రఘువరా’ , ‘ఇనకులాభి సోమా’ ,’రాఘవా’ అని పిలవాలి. రాముడు అయోధ్యలో లేని పక్షంలో భరతుడు రాజ బాధ్యతలు తీసుకోగలడు. ధర్మం అనుసరించడం శ్రీరాముడు కర్తవ్యంగా భావిస్తే అన్నను అనుసరించడం తమ ధర్మమని తమ్ములు భావించారు. మిథిలలో మెదలిన రాముని ఆజానుబాహు రూపాన్ని కోరుకున్న సీత అదే రామునితో అయోధ్యను వీడినప్పుడు అతని పాదాలనే అనుసరించింది. అడవికి అన్న వెళ్ళిపోయినా అతని పాదుకలు పెట్టి రాజ్యమేలాడు భరతుడు. సీతమ్మ వియోగ సమయంలో యజ్ఞం చేయవలసివస్తే స్వర్ణ సీతను నెలకొల్పాడు రాముడు. ఇలా ఎవరికివారే ఆదర్శమూర్తులు. ‘ధర్మం’ పాటించడం క్షత్రియ లక్షణం. అదే రాజు అనదగ్గ వాడి ప్రథమ కర్తవ్యం. శ్రీరాముడు ‘ధర్మజ్ఞ:’ (ధర్మజ: - అని ధర్మరాజు ననాలి)
1 Comment
|
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|